పోస్ట్‌లు

జనవరి, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

గోదాదేవి - తిరుప్పావై | 30 పాశురములు వాటి వివరణలు

చిత్రం
  గోదాదేవి -   తిరుప్పావై భారతదేశంలో   ధనుర్మాసంలో   పెళ్ళికాని పడుచులు , తమకు మంచి భర్తని ప్రసాదించమని   గోదాదేవి (ఆండాళ్) ని   వేడుకుంటూ , పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది , దీనినే కాత్యాయినీ వ్రతం అంటారు. ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతం , ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మిక. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా , ప్రతిదినం తమ యిళ్ళలో , దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కాని ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై , ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్కృప , శాంతిసౌఖ్యాలను కోరుకుంటూ , వీటిని గానం చేస్తారు. ఆండాళ్ తన చెలులతో కలిసి , శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ , ముప్ఫై రోజులు కఠిన వ్రతమాచరిస్తుంది. పన్నిద్దరాళ్వారులలో ఒకరైన గోదాదేవి రచించిన ముప్పది పాశురాల ప్రబంధం. వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాశురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. గోదాదేవి విష్